బీజీపీ అస్సలు తగ్గడం లేదుగా....!

Update: 2018-02-16 07:48 GMT

బీజేపీ ఏమాత్రం తగ్గడం లేదు. ఏపీకి అంతా చేసినా ఏమీ చేయలేదని ఏపీ సర్కార్ చెప్పడం అన్యాయమన్నారు. పదేళ్లలో రావాల్సిన సంస్థలు రెండేళ్లలోనే వచ్చాయన్నారు. ఇస్తేనేమో మా హక్కని, ఇవ్వకపోతేమోడీ పాపం చేశారని ప్రచారం చేయడం తగదనిబీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కంభంపాటి హరిబాబు తెలిపారు. ఏపీకి సాయం చేయడమనేది నిరంతర ప్రక్రియ అని ఆయన అన్నారు. ఏపీ అభివృద్ధి అంతా మోడీ ఆశీస్సులతో, సహకారంతోనే జరిగిందని చెప్పారు. మోడీకి ఏపీ పట్ల ప్రత్యేక శ్రద్ధ ఉందన్నారు. విభజన చట్టం ప్రకారం ఇప్పటికే హామీలన్నీ నెరవేర్చామన్నారు. విశాఖ రైల్వే జోన్ కేంద్రం పరిశీలనలోనే ఉందన్నారు. స్మార్ట్ సిటీలను కేటాయించి మూడు నగరాలకు ఆరు వందల కోట్లు విడుదల చేసిందన్నారు. వివిధ రూపాల్లో కేంద్ర ప్రభుత్వం సాయం చేస్తూనే ఉందన్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సహకరించుకుంటేనే అభివృద్ధి సాధ్యమవుతుందన్నారు. కేంద్రం నుంచి వచ్చిన సాయం విషయంలో కేంద్రాన్ని పొగడకపోయినా.. ఆ సాయాన్ని గుర్తించాల్సిందిగా హరిబాబు కోరారు.

Similar News