పిచ్చి వేషాలేస్తే అమరావతిని ఆపేస్తాం...!

Update: 2018-07-28 09:37 GMT

అమరావతిని ఆపేస్తామని జనసేన అధినేత పవన్ కల్యాణ్ హెచ్చరించారు. భూసమీకరణ విషయంలో పిచ్చి పిచ్చి నిర్ణయాలు తీసుకుంటే మహారాష్ట్ర తరహాలో రైతు ఉద్యమం చేస్తామని వార్నింగ్ ఇచ్చారు. అడిగేవాళ్లు లేరని అనుకుని పిచ్చి నిర్ణయాలు తీసుకుంటే ప్రజలు తాట తీస్తారన్నారు. చంద్రబాబును తాను కలసిన సమయంలో 1,850 ఎకరాలు రాజధానికి సరిపోతుందని చెప్పారని, ఇప్పుడు లక్ష ఎకరాలు సమీకరిస్తున్నారని అననారు. చంద్రబాబు తప్పు చేస్తున్నారన్నారు. తాను ప్రజలను కదలించగలనని, డబ్బుతో తనను కొనలేరని చెప్పారు. ప్రజాభిప్రాయానికి వ్యతిరేకంగా నిర్ణయాలు తీసుకుంటే అమారావతిని ఆపేస్తామని, రాజధాని నిర్మాణాన్ని అడ్డుకుంటామని అన్నారు. ఎన్నికల సమయంలోనే పొత్తుల గురించి ఆలోచిస్తానని, ఇప్పుడు ఉద్యమాలు చేయడమే తన లక్ష్యమని వివరించారు. భూసేకరణ చట్టంపై జరిగిన సదస్సలో పవన్ ఈ వ్యాఖ్యలు చేశారు.

Similar News