నేడు చంద్రబాబుతో పన్నీర్ సెల్వం భేటీ

Update: 2017-01-12 03:56 GMT

తమిళనాడు ముఖ్యమంత్రి పన్నీరు సెల్వం ఈరోజు ఆంధ్రప్రదేశ్ కు రానున్నారు. ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబును పన్నీరు సెల్వం కలవనున్నారు. తమిళనాడుకు మంచినీరు అందించాలని పన్నీరుసెల్వం బాబును కోరనున్నారు. తెలుగుగంగ ప్రాజెక్టు ద్వారా చెన్నైకి మంచినీటి సరఫరా చేయాలని చంద్రబాబును కోరనున్నారు.

తమిళనాడులో అన్ని జిల్లాలను ప్రభుత్వం కరువు జిల్లాలుగా ప్రకటించింది. కర్ణాటక నుంచి సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు కావేరీ జలాలను విడుదల చేస్తోంది. అయితే చెన్నై తాగునీటి సమస్యతో అల్లాడుతోంది. ఈ నేపథ్యంలో పన్నీరు సెల్వం చంద్రబాబును కలిసి తెలుగుగంగ ద్వారా చెన్నైకి సాగునీరు విడుదల చేయాలని కోరనున్నారు. చంద్రబాబు కూడా గతంలో చెన్నైకి తాగునీటి విడుదల విషయంలో సుముఖత వ్యక్తం చేశారు.

Similar News