జై...కాంగ్రెస్ అన్న రేవంత్

Update: 2017-10-31 07:36 GMT

రాహుల్ గాంధీ సమక్షంలో రేవంత్ అధికారికంగా కాంగ్రెస్ పార్టీలో చేరిపోయారు. రేవంత్ రెడ్డి వెంట దాదాపు 45 మంది వివిధ స్థాయుల్లో ఉన్న నేతలు కాంగ్రెస్ పార్టీలో చేరారు. కొద్దిసేపటి క్రితమే రాహుల్ ను ఏఐసీసీ కార్యాలయంలో కలిసిన రేవంత్ రెడ్డి అధికారికంగా పార్టీలో చేరుతున్నట్లు ప్రకటించారు. మాజీ మంత్రులు, మాజీ శాసనసభ్యులు, మాజీ ఎమ్మెల్సీలు, జిల్లా పార్టీ ఇన్ ఛార్జులు చేరారు. టీఆర్ఎస్ పార్టీ నుంచి దొమ్మాటి సాంబయ్య రేవంత్ వెంట నడిచారు.

Similar News