జగన్ కు జీవితాంతం రుణపడి ఉంటానన్న రోజా

Update: 2017-06-24 09:05 GMT

జీవితాంతం జగన్ కు రుణపడి ఉంటానని వైసీపీ ఎమ్మెల్యే రోజా చెప్పారు. తాను జనసేన పార్టీలోకి వెళుతున్నట్లు వస్తున్న వార్తలను రోజా తీవ్రంగా ఖండించారు. ఇటువంటి పిచ్చి రాతలు రాసేటప్పుడు కనీసం తనను సంప్రదించాలని ఆమె కోరారు. తన మీద కావాలనే కొందరు దుష్ప్రచారాన్ని చేస్తున్నారన్నారు. తాను వైసీపీని వీడబోనని స్పష్టం చేశారు. తనకు అత్యంత ప్రాముఖ్యత నిచ్చిన జగన్మోహన్ రెడ్డికి జీవితాంతం రుణపడి ఉంటానని రోజా చెప్పారు. ఏపీలో మద్యం పాలసీపై రోజా విరుచుకుపడ్డారు. మహిళలతో కలిసి ఉద్యమిస్తామని చెప్పారు. రోజా వైసీపీని వీడి జనసేనలోకి వెళుతున్నారంటూ సోషల్ మీడియాలో విపరీతంగా వార్తలు రావడంతో ఈరోజు రోజా మీడియా ముందుకువచ్చి వివరణ ఇవ్వాల్సి వచ్చింది.

Similar News