చంద్రబాబుకు వదినమ్మ కౌంటర్ అదిరిందే...!

Update: 2018-01-27 12:37 GMT

చంద్రబాబు చేసిన వ్యాఖ్యలపై బీజేపీనేత పురంద్రీశ్వరి స్పందించారు. బీజేపీతో ఉండాలో...? లేదో? టీడీపీ యే తేల్చుకోవాలని పురంద్రీశ్వరి సవాల్ విసిరారు. బీజేపీ మిత్రధర్మం పాటించడం లేదన్నది సరికాదన్నారు. కేంద్ర ప్రభుత్వ పథకాలనే తమ పథకాలుగా చంద్రబాబు ప్రచారం చేసుకుంటున్నారన్నారు. ఫిరాయింపు నేతలపై చర్యలు తీసుకోవాలంటూ తాను బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షాకు లేఖ రాశానన్నారు పురంద్రీశ్వరి. ఎన్టీఆర్ అధికారంలో ఉన్నప్పుడు కేంద్రంలో మంత్రులుగా ఉన్నవారిచేత రాజీనామా చేయించిన విషయాన్ని ఈ సందర్భంగా గుర్తు చేశారు. చంద్రబాబు కూడా అదే బాట పడితే బాగుంటుందని పురంద్రీశ్వరి సూచించారు. చంద్రబాబు వ్యాఖ్యలను తమ పార్టీ హైకమాండ్ చూసుకుంటుందని వ్యాఖ్యానించారు.

Similar News