గుత్తిలో గొంతెత్తిన జగన్

Update: 2017-12-04 11:46 GMT

మనకు ఎలాంటి నాయకుడు కావాలని మనస్సాక్షిని అడగాలని వైసీపీ అధినేత జగన్ అన్నారు. అనంతపురం జిల్లా గుత్తిలో జరిగిన బహిరంగ సభలో జగన్ ప్రసంగించారు. నాలుగేళ్ల పాలనలో ప్రజలను చంద్రబాబు ప్రజలను వంచించారన్నారు. ప్రతిదీ అబద్ధం చెపుతున్నారన్నారు. మోసం చేసే నాయకులను దగ్గరకు రానివ్వద్దన్నారు. చంద్రబాబు పాలన అంత గొప్పగా ఉంటే... ఈ ప్రాంతం ఇంత వెనకబడి ఎందుకు ఉంటుందన్నారు. తన పాదయాత్రలో ప్రజల కష్టాలు వింటున్నానని, ప్రజలు ప్రభుత్వంపై తీవ్ర అసంతృప్తితో ఉన్నారన్నారు. 108 సిబ్బందికి రెండు నెలలు జీతాలివ్వలేని ప్రభుత్వం ఏం అభివృద్ధి పనులు చేస్తుందని ప్రశ్నించారు. చంద్రబాబు పాలనలో విచ్చలవిడి అవినీతి కన్పిస్తుందన్నారు. ఇసుక నుంచి మద్యం వ్యాపారం దాకా... మద్యం నుంచి కాంట్రాక్టర్ల వరకూ...కాంట్రాక్టర్ల నుంచి రాజధాని భూముల వరకూ దేన్నీ వదలిపెట్టడం లేదన్నారు. గ్రామగ్రామాన చంద్రబాబు మాఫియాను తయారు చేశారన్నారు. గ్రామాల్లో పింఛను కావాలన్నా, మరుగుదొడ్డి కావాలన్నా లంచాలు ఇవ్వాల్సిందేనన్నారు. గుత్తి బహిరంగ సభకు పెద్దసంఖ్యలో జనం హాజరయ్యారు.

Similar News