కొత్త కేసులు 18… నేడు ఒకరు మృతి

తెలంగాణలో కొత్తగా ఈరోజు 18 కరోనా పాజిటివ్ కేసులు నమోదయినట్లు వైద్య, ఆరోగ్యశాఖ మంత్రి ఈటల రాజేందర్ తెలిపారు. దీంతో మొత్తం 471 కరోనా పాజిటివ్ కేసులు [more]

Update: 2020-04-09 13:36 GMT

తెలంగాణలో కొత్తగా ఈరోజు 18 కరోనా పాజిటివ్ కేసులు నమోదయినట్లు వైద్య, ఆరోగ్యశాఖ మంత్రి ఈటల రాజేందర్ తెలిపారు. దీంతో మొత్తం 471 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. కరోనా కారణంగా ఈరోజు ఒకరు మృతి చెందారు. దీంతో తెలంగాణలో చనిపోయిన వారి సంఖ్య 12కు చేరుకుంది. ఇప్పటికి తెలంగాణలో 414 కరోనా యాక్టివ్ కేసులు ఉన్నాయని ఈటల రాజేందర్ తెలిపారు. ఇప్పటి వరకూ 45 మంది డిశ్చార్జి అయ్యారని చెప్పారు. లాక్ డౌన్ వల్ల కేసుల సంఖ్య క్రమంగా తగ్గుతుందని ఈటల రాజేందర్ అభిప్రాయపడ్డారు. తెలంగాణలో 101 హాట్ స్పాట్ లను గుర్తించామని, అక్కడ రాకపోకలను పూర్తిగా నిషేధించినట్లు మంత్రి వెల్లడించారు. ఇప్పటి వరకూ తెలంగాణలో 45 మంది డిశ్చార్జి అయ్యారన్నారు.

Tags:    

Similar News