కేసీఆర్ పై చిదంబరం ఫైర్

Update: 2017-01-29 12:16 GMT

తెలంగాణ సర్కార్ పై మాజీ ఆర్థిక మంత్రి చిదంబరం ఫైర్ అయ్యారు. పేదలకు డబుల్ బెడ్ రూం ఇవ్వడం లేదని, కేసీఆర్ మాత్రం క్యాంప్ కార్యాలయాన్ని ప్రజాధనాన్ని వెచ్చించి నిర్మించారన్నారు. హైదరాబాద్ గాంధీభవన్ లో జరిగిన పీసీసీ విస్తృత స్థాయీ సమావేశానికి ఆయన ముఖ్య అతిధిగా హాజరయ్యారు. తెలంగాణ సర్కార్ ఎన్నికల హామీలను సక్రమంగా అమలు చేయడం లేదన్నారు. దళితులకు మూడెకరాల భూమిని కూడా పంచలేదన్న చిదంబరం రాష్ట్ర ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా పోరాడాలని కాంగ్రెస్ శ్రేణులకు పిలుపునిచ్చారు.

మండల స్థాయి నుంచే కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలలో నూతనోత్తేజం తేవాలన్నారు చిదంబరం. కాంగ్రెస్ గతంలో చేసిన తప్పులను సరిదిద్దుకోవాల్సిన అవసరం కూడా ఉందన్నారు. కాంగ్రెస్ తాను చేసిన పనులను ప్రజలకు వివరించడంలో వైఫల్యం చెందామన్నారు. తెలంగాణను కాంగ్రెస్ పార్టీ కష్టమ్మీద ఇచ్చినా ఆ క్రెడిట్ దక్కించుకోలేక పోయామన్నారు. ఇకనైనా కార్యకర్తలు పార్టీని కాపాడుకోవాలని పిలుపునిచ్చారు.

Similar News