కర్ణాటకలో ఈ ఎన్నిక వాయిదా ఎందుకంటే?

Update: 2018-05-11 13:51 GMT

కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో భాగంగా రేపు జరగాల్సిన రాజరాజేశ్వరినగర్ ఎన్నిక వాయిదా వేస్తూ ఎన్నికల సంఘం నిర్ణయం తీసుకుంది. ఇక్కడ భారీ ఎత్తున నకిలీ ఓటర్ కార్డులు దొరికిన విషయం తెలిసిందే. ఈ ఘటనలో సిట్టింగ్ ఎమ్మెల్యే ముణిరత్నం సహా 14 మంది అతని అనుచరులపై కేసు నమోదైంది. కాగా, ఇటువంటి పరిస్థితుల్లో ఈ నియోజకవర్గంలో ఎన్నిక వాయిదా వేస్తేనే మేలని భావించిన ఎన్నికల సంఘం ఎన్నికను ఈ నెల 28కి వాయిదా వేసింది. ఈ నియోజకవర్గం ఓట్ల లెక్కింపు 31న జరపనున్నట్లు ప్రకటించింది. కాగా, మొత్తం 224 నియోజకవర్గాలు ఉన్న కర్ణాటకలో ఇప్పటికే బీజేపీ అభ్యర్థి మరణంతో ఓ స్థానంలో ఎన్నిక వాయిదా పడింది. దీంతో ఇప్పుడు 222 నియోజకవర్గాలకే ఎన్నికలు జరగనున్నాయి.

Similar News