హైదరాబాద్ కేంద్రీయ విశ్వవిద్యాలయం, ఉస్మానియా విశ్వవిద్యాలయాల్లో జరుగుతున్న పరిణామాలు విచారకరమని ముఖ్యమంత్రి కేసీఆర్ అన్నారు. తెలంగాణ శాసనసభలో సీఎం మాట్లాడుతూ..హెచ్సీయూ, ఓయూ ఘటనలు దురదృష్టకరం.. అందరం ఖండించదగినవేన్నారు. ఓయూలో ఎమ్మెల్యే సంపత్ కుమార్ కారుపై జరిగిన దాడిని సీఎం ఖండించారు. బాధ్యులపై చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటామన్నారు. హెచ్సీయూ, ఓయూ ఘటనలపై చర్చకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని స్పష్టం చేశారు.