ఎమెర్జెన్సీ మీటింగ్...!

Update: 2018-06-22 13:20 GMT

తెలంగాణ కాంగ్రెస్ నేతలు అత్యవసరంగా సమావేశమయ్యారు. సీఎల్పీ నేత జానారెడ్డి నివాసంలో కొద్దిసేపటి క్రితం ఈ భేటీ ప్రారంభమయింది. దానం నాగేందర్ పార్టీకి రాజీనామా చేయడం, తదనంతర పరిణామాలపై వీరు చర్చించనున్నారు. జానారెడ్డి ఇంట్లో జరుగుతున్న ఈ సమావేశానికి పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి, షబ్బీర్ ఆలీ, వి.హనుమంతరావు తదితరులు హాజరయ్యారు. దానం పార్టీ మారడం కాంగ్రెస్ కు నష్టమేనని వీహెచ్ అంగీకరించారు. దానం పార్టీ మారడానికి గల కారణాలను తెలుసుకోవాల్సి ఉందన్నారు. ఈ సమయంలో ఎవరు పార్టీ మారినా నష్టమేనన్నారు. మరోవైపు పీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి స్వయంగా దానం ఇంటికి వెళ్లి ఆయనతో చర్చించారు. వ్యక్తిగతకారణాల వల్లనే పార్టీ మారుతున్నట్లు దానం ఉత్తమ్ తో చెప్పినట్లు తెలుస్తోంది. అలాగే దానం నాగేందర్ కొద్దిసేపటి క్రితం మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ తో సమావేశం కావడం విశేషం. దానం రెండు, మూడురోజుల్లో టీఆర్ఎస్ లో చేరే అవకాశం ఉంది.

Similar News