అరుణ్ జైట్లీ ప్రకటన తర్వాత అమరావతిలో రాజకీయ పరిణామాలు వేగంగామారుతున్నాయి. జైట్లీ ప్రకటన తర్వాత మంత్రులందరినీ వెంటనే సచివాలయానికి రావాలని చంద్రబాబు ఆదేశించారు. టీడీపీ ఎంపీలతో చంద్రబాబు టెలికాన్ఫరెన్స్ నిర్వహిస్తున్నారు. చంద్రబాబుతో మంత్రులు యనమల రామకృష్ణుడు, కాల్వ శ్రీనివాసులు, అచ్చెన్నాయుడు, నారాయణ భేటీ అయ్యారు.