అమ్మవారి సేవలో గవర్నర్!

Update: 2016-03-30 14:49 GMT

విజయవాడ ఇంద్రకీలాద్రిపై కొలువై ఉన్న శ్రీ కనకదుర్గమ్మ అమ్మవారిని గవర్నర్‌ నరసింహన్‌ దర్శించుకున్నారు. ఈ సందర్భంగా అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం గవర్నర్‌కు వేద పండితులు ఆశీర్వచనం చేశారు. నేటి సాయంత్రం ఎన్టీఆర్‌ ఆరోగ్య విశ్వవిద్యాలయం వార్షిక స్నాతకోత్సవంలో ఆయన పాల్గొననున్నారు.

Similar News