ఆ లేఖపై వైసీపీ సీరియస్

నిన్న రాష్ట్ర ఎన్నిక అధికారి నిమ్మగడ్డ రమేష్ కుమార్ పేరిట విడుదలయిన లేఖపై వైసీపీ సీరియస్ గా తీసుకుంది. ఈరోజు సాయంత్రం 4గంటలకు వైసీపీ ఎమ్మెల్యేలు డీజీపీని [more]

Update: 2020-03-19 08:58 GMT

నిన్న రాష్ట్ర ఎన్నిక అధికారి నిమ్మగడ్డ రమేష్ కుమార్ పేరిట విడుదలయిన లేఖపై వైసీపీ సీరియస్ గా తీసుకుంది. ఈరోజు సాయంత్రం 4గంటలకు వైసీపీ ఎమ్మెల్యేలు డీజీపీని కలవనున్నారు. ఈ లేఖ రమేష్ కుమార్ రాసిందా? లేక నకిలీదా? తేల్చాలని వైసీపీ ఎమ్మెల్యేలు డీజీపీని కోరనున్నారు. అయితే ఆ లేఖ పై నిమ్మగడ్డ రమేష్ కుమార్ ఇప్పటి వరకూ ఎలాంటి వివరణ ఇవ్వలేదు. ఆయన నిన్న రాత్రే హైదరాబాద్ వెళ్లిపోయారు. దీంతో ఆ లేఖపై నిజానిజాలను నిగ్గు తేల్చాలని వైసీపీ ఎమ్మెల్యేలు డీజీపీని కోరనున్నారు.

Tags:    

Similar News