జగన్ సినిమాకు వెళ్లినా భరించలేరా..?

కుటుంబసభ్యులతో జగన్ సినిమాకు వెళ్లినా భరించలేకుండా రాజకీయం చేస్తున్న ధీన స్థితిలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఉన్నారని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకురాలు వాసిరెడ్డి పద్మ పేర్కొన్నారు. [more]

Update: 2019-05-04 07:16 GMT

కుటుంబసభ్యులతో జగన్ సినిమాకు వెళ్లినా భరించలేకుండా రాజకీయం చేస్తున్న ధీన స్థితిలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఉన్నారని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకురాలు వాసిరెడ్డి పద్మ పేర్కొన్నారు. శనివారం ఆమె మీడియాతో మాట్లాడుతూ… చంద్రబాబు ఓటమి భయంతో ఈసీపై, ఈవీఎంలపై, జగన్ పై విమర్శలు చెస్తున్నారని ఆరోపించారు. చంద్రబాబు మాటలు చూసి తెలుగుదేశం పార్టీ కార్యకర్తలే సిగ్గు పడుతున్నారని పేర్కొన్నారు. చంద్రబాబుకు ముందు నుంచీ పదవి పోతుందనే భయం ఉంటుందని, అందుకే తన తమ్ముడిని, ఎన్టీఆర్ కుటుంబంలోని వారిని ఎదగనీయకుండా చంద్రబాబు చూశారని ఆరోపించారు. చంద్రబబు పాలనలో ఐదుగురు సీఎస్ లుగా పనిచేస్తే ముగ్గురు ఆయనకు పంటి కింద రాయిలా మారారంటే చంద్రబాబు ఎటువంటి విధానాలను అవలంభించారో అర్థం చేసుకోవచ్చన్నారు.

Tags:    

Similar News