పొత్తులపై వైసీపీ కీలక ప్రకటన

Update: 2018-06-16 07:00 GMT

వైసీపీ బీజేపీతో కలిసి పోటీ చేస్తుందని టీడీపీ తప్పుడు ప్రచారం చేస్తుందని, గత ఎన్నికల మాదిరిగానే ఈ ఎన్నికల్లో కూడా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఒంటరి పోరుకే దిగుతుందని ఆ పార్టీ సీనియర్ నేత బొత్స సత్యనారాయణ స్పష్టం చేశారు. శనివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ... కేంద్రంలో ఏ ప్రభుత్వం ఉన్నా ఒత్తిడి తీసుకువచ్చి రాష్ట్రానికి కావాల్సినవి తీసుకువచ్చి, రాష్ట్రాన్ని అభివృద్ధి చేసే శక్తి వైసీపీకి ఉందన్నారు. బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి బీజేపీ నేతలతో భేటీ అయ్యారని టీడీపీ తప్పుడు ప్రచారం చేస్తుందన్నారు. వెహికిల్ లాగ్ బుక్ లో బుగ్గన సౌత్ ఎవెన్యూ వెళ్లారని ఉంటే, అందులో 27 నెంబర్ ఇంటికి వెళ్లినట్లు ఇరికించి రాశారని స్పష్టం చేశారు. మాకు చంద్రబాబుపై కుట్రలు చేయాల్సిన అవసరం లేదని, చంద్రబాబు నాయుడు అవినీతి చేసిన విషయం అందరికీ తెలుసన్నారు. బాబు ఎందుకు భయపడుతున్నారో అర్థం కావడం లేదన్నారు. బీజేపీకి చెందిన కేంద్రమంత్రి నిర్మలా సీతారామన్ భర్త పరకాల ప్రభాకర్ ని చంద్రబాబు తన పక్కన పెట్టుకుంది వాస్తవం కాదా అని ప్రశ్నించారు. చంద్రబాబుపై కేసులు పెడితే రాష్ట్ర అగ్నిగుండం అవుతుందని అంటున్నారని, అంటే ఎంత దోచుకున్నా ఎవరూ ఏమీ అనవద్దా అని ప్రశ్నించారు. దోోచుకునేందుకు బాబుకి ప్రజలు అధికారం ఇచ్చారా అని ప్రశ్నించారు.

Similar News