ఢిల్లీకి వైసీపీ ఎంపీలు.. రాజుగారిపై ఆపరేషన్ స్టార్ట్

వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎంపీలు ఢిల్లీకి బయలుదేరి వెళ్లారు. ఈరోజు మధ్యాహ్నం 3గంటలకు లోక్ సభ స్పీకర్ ఓంబిర్లాను కలుస్తారు. ఎంపీ రఘురామ కృష‌్ణంరాజుపై అనర్హత పిటీషన్ [more]

Update: 2020-07-03 05:27 GMT

వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎంపీలు ఢిల్లీకి బయలుదేరి వెళ్లారు. ఈరోజు మధ్యాహ్నం 3గంటలకు లోక్ సభ స్పీకర్ ఓంబిర్లాను కలుస్తారు. ఎంపీ రఘురామ కృష‌్ణంరాజుపై అనర్హత పిటీషన్ ను స్పీకర్ కు అందజేస్తారు. రఘురామ కృష్ణంరాజు పార్టీ నిబంధనలు థిక్కరించడమే కాకుండా, విధానాలను, నిర్ణయాలను తప్పుపట్టిన విషయాలపై ఆధారాలతో స్పీకర్ కు అందజేయనున్నారు. మొత్తం ఆరుగురు ఎంపీలు ఢిల్లీకి ప్రత్యేక విమానంలో బయలుదేరి వెళ్లారు. విజయసాయిరెడ్డి, మిధున్ రెడ్డి, బాలశౌరి, మార్గాని భరత్, లావు కృష్ణదేవరాయలు, నందిగం సురేష్ లు ఉన్నారు.

Tags:    

Similar News