అధికారం కోల్పోతున్నామనే నైరాశ్యంలోనే ..?

తెలుగుదేశం పార్టీ అధికారం కోల్పోతుందనే ఫ్రస్ట్రేషన్ తోనే వైఎస్సార్ కాంగ్రెస్ కార్యకర్తలపై దాడులకు తెగబడుతోందని వైసీపీ నేత వైవీ సుబ్బారెడ్డి ఆరోపించారు. రాష్ట్రవ్యాప్తంగా వైసీపీ కార్యకర్తలపై టీడీపీ [more]

Update: 2019-04-11 04:40 GMT

తెలుగుదేశం పార్టీ అధికారం కోల్పోతుందనే ఫ్రస్ట్రేషన్ తోనే వైఎస్సార్ కాంగ్రెస్ కార్యకర్తలపై దాడులకు తెగబడుతోందని వైసీపీ నేత వైవీ సుబ్బారెడ్డి ఆరోపించారు. రాష్ట్రవ్యాప్తంగా వైసీపీ కార్యకర్తలపై టీడీపీ నేతల దాడులను ఆయన ఖండించారు. ఏలూరులో వైసీపీ ఏజెంట్ పై దాడి చేసిన టీడీపీ ఎమ్మెల్యే బడేటి బుజ్జిని వెంటనే అరెస్టు చేయాలని, ఎన్నికల్లో పోటీకి ఆయనపై అనర్హత వేయాలని డిమాండ్ చేశారు. కడపలో వైసీపీ ఏజెంట్ పై దాడి చేసిన టీడీపీ ఎంపీ సీఎం రమేష్ పైనా చర్యలు తీసుకోవాలన్నారు. పలు తెలుగుదేశం అనుకూల ఛానళ్లు టీడీపీ నేతలు దాడులు చేస్తుంటే వైసీపీపై తప్పుడు ప్రచారం చేస్తున్నాయని ఆరోపించారు. గుత్తిలో గుంతకల్లు జనసేన అభ్యర్థి ఈవీఎంలను పగలగొడితే వైసీపీ వారు పగలగొట్టారని దుష్ప్రచారం చేశారని ఆరోపించారు.

Tags:    

Similar News