ఆ పదిహేడు మంది ఎవరు?

శాసనసభలో అతి కీలకమైన తీర్మానం ప్రవేశపెట్టారు. జగన్ ప్రతిష్టాత్మకంగా తీసుకున్న శాసనమండలిని రద్దు చేసే ప్రతిపాదన సభ ముందుకు వచ్చింది. అయితే వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి చెందిన [more]

Update: 2020-01-27 12:41 GMT

శాసనసభలో అతి కీలకమైన తీర్మానం ప్రవేశపెట్టారు. జగన్ ప్రతిష్టాత్మకంగా తీసుకున్న శాసనమండలిని రద్దు చేసే ప్రతిపాదన సభ ముందుకు వచ్చింది. అయితే వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి చెందిన 17 మంది సభ్యులు శాసనసభకు గైర్హాజరయ్యారు. ఓటింగ్ లో పాల్గొనలేదు. శాసనమండలి రద్దు పై చర్చ ముగిసిన తర్వాత స్పీకర్ ఓటింగ్ నిర్వహించారు. ఇందులో జనసేన ఎమ్మెల్యే రాపాక వరపప్రసాద్ ప్రభుత్వానికి అనుకూలంగా ఓటు వేశారు. శాసనసభలో 151 మంది సభ్యుల బలం వైసీపీకి ఉంది. ఇందులో స్పీకర్ ను మినహాయిస్తే 150 ఓట్లు రావాల్సి ఉండగా 133 మంది ఓట్లు మాత్రమే జగన్ చేసిన ప్రతిపాదనకు అనుకూలంగా ఓట్లు వచ్చాయి. అయితే ఆ పదిహేడు మంది ఎవరు? వారు ఎందుకు గైర్హాజరయ్యానది పార్టీలో చర్చనీయాంశంగా మారింది.

Tags:    

Similar News