ఈ తిక్కలోడితో మాకేంటి?

పవన్ కల్యాణ్ పై వైసీపీ నేతలు తీవ్ర విమర్శలుచేశారు. అమరావతి రాజధాని రైతులను పరామర్శించడానికి వెళ్లిన పవన్ కల్యాణ్ జగన్ పై విమర్శలు చేయడం ఏంటని ప్రశ్నించారు. [more]

Update: 2019-12-31 13:48 GMT

పవన్ కల్యాణ్ పై వైసీపీ నేతలు తీవ్ర విమర్శలుచేశారు. అమరావతి రాజధాని రైతులను పరామర్శించడానికి వెళ్లిన పవన్ కల్యాణ్ జగన్ పై విమర్శలు చేయడం ఏంటని ప్రశ్నించారు. ఆయన ఏమైనా అతీతుడా? అని వైసీపీ నేత జోగి రమేష్ ప్రశ్నించారు. పవన్ కల్యాణ్ వేషాలు మార్చడానికి, పెళ్లాలను మార్చడానికి మాత్రమే పనికొస్తారని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. కేవలం చంద్రబాబు తోకలాగా మారి రాజధాని అమరావతిలో పవన్ కల్యాణ్ అడుగుపెట్టారన్నారు. గత ఐదేళ్లుగా చంద్రబాబు రైతులను మోసం చేస్తుంటే ఎందుకు నోరు మెదపలేదని అవంతి శ్రీనివాస్ ప్రశ్నించారు. పవన్ కల్యాణ్ పతనం ఎప్పుడో జరిగిపోయిందన్నారు. రైతులను రెచ్చగొట్టేందుకు వెళ్లారే తప్ప ఆయనకు మరోపనిలేదని అన్నారు.

Tags:    

Similar News