ప్యాకేజీకి అమ్ముడుపోవడమే పౌరుషమా పవన్..?

వైఎస్ జగన్ కు పౌరుషం లేదా అంటూ జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలపై వైసీపీ నేత, మాజీ మంత్రి సి.రామచంద్రయ్య మండిపడ్డారు. మంగళవారం ఆయన [more]

Update: 2019-04-02 09:47 GMT

వైఎస్ జగన్ కు పౌరుషం లేదా అంటూ జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలపై వైసీపీ నేత, మాజీ మంత్రి సి.రామచంద్రయ్య మండిపడ్డారు. మంగళవారం ఆయన అమరావతిలో మీడియాతో మాట్లాడుతూ… అధికార పార్టీని వదిలేసి ప్రతిపక్షాన్ని తిడుతున్న పవన్ కళ్యాణ్ వైఖరిని చూసి తెలుగు ప్రజలంతా ఆశ్చర్యపోతున్నారని అన్నారు. ప్యాకేజీకి అమ్ముడుపోవడం, చంద్రబాబుతో లాలూచీ పడటమే పౌరుషమా అని ప్రశ్నించారు. ప్యాకేజీ అనే పదానికి పవన్ కళ్యాణ్ వల్లే ప్రాధాన్యత వచ్చిందని అన్నారు. పదేపదే పౌరుషం అంటున్న పవన్ కళ్యాణ్ పార్టీ పెట్టి పోటీ చేయకుండా ఉండటమే పౌరుషమా అని ప్రశ్నించారు. లేని ఆవేశాన్ని తెచ్చుకొని ఊగిపోవడం పౌరుషమా అని ఎద్దేవా చేశారు. ఆరునెలల కింద చంద్రబాబు, లోకేష్ అవినీతిపై మాట్లాడిన పవన్ ఇప్పుడు ఎందుకు మాట్లాడటం లేదని అడిగారు. పవన్ కు మతిమరుపు వచ్చిందా అని ప్రశ్నించారు.

Tags:    

Similar News