లక్ష్మీనారాయణ ముసుగు తొలగుతోంది

సీబీఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణకు ముందునుంచీ తెలుగుదేశం పార్టీతో రహస్య సంబంధాలు ఉన్నాయని, ఆయన ముసుగు ఇప్పుడు తొలిగిపోతోందని వైసీపీ నేత అంబటి రాంబాబు ఆరోపించారు. టీడీపీతో [more]

Update: 2019-03-12 08:04 GMT

సీబీఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణకు ముందునుంచీ తెలుగుదేశం పార్టీతో రహస్య సంబంధాలు ఉన్నాయని, ఆయన ముసుగు ఇప్పుడు తొలిగిపోతోందని వైసీపీ నేత అంబటి రాంబాబు ఆరోపించారు. టీడీపీతో కుమ్మక్కయిన లక్ష్మీనారాయణ జగన్ పై తప్పుడు కేసులు పెట్టారని, 90 రోజుల్లో బెయిల్ రావాల్సిన కేసులో 16 నెలలు బెయిల్ రాకుండా లక్ష్మీనారాయణ కుట్ర చేసి వేధించారని ఆరోపించారు. జగన్ పై పెట్టిన కేసులు వీగిపోతున్నాయంటే, ఆయనపై లక్ష్మీనారాయణ తప్పుడు కేసులు పెట్టడమే కారణమన్నారు. లక్ష్మీనారాయణను నిజాయితీపరుడిగా టీడీపీకి చెందిన రెండు పత్రికలు కీర్తించాయని, అవాస్తవాలను వాస్తవాలుగా మార్చాయని అన్నారు. చంద్రబాబు, లక్ష్మీనారాయణ రహస్య సంబంధాలపై విచారణ జరిపించాల్సిన అవసరం ఉందన్నారు. లక్ష్మీనారాయణ త్వరలో టీడీపీలో చేరనున్నారని వార్తలు వస్తున్న విషయం తెలిసిందే.

Tags:    

Similar News