వివేకా హత్య కేసు విచారణ వేగవంతం

వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో సీబీఐ అధికారులు విచారణ ప్రారంభించారు. మొత్తం నలుగురు అధికారులు కడపకు చేరుకున్నారు. నిన్న వివేకాందరెడ్డి ఇంటి సమీపంలో ఉన్న డెయిరీ వ్యాపారి [more]

Update: 2021-04-13 00:55 GMT

వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో సీబీఐ అధికారులు విచారణ ప్రారంభించారు. మొత్తం నలుగురు అధికారులు కడపకు చేరుకున్నారు. నిన్న వివేకాందరెడ్డి ఇంటి సమీపంలో ఉన్న డెయిరీ వ్యాపారి తోపాటు సెల్ పాయింట్ నిర్వాహకుడిని ప్రశ్నించారు. వీరితో పాటు వివేకా వ్యక్తిగత కార్యదర్శితో పాటు వివేకా అనుచరుడు గంగిరెడ్డిని కూడా సీబీఐ అధికారులు ప్రశ్నించారు. ఈరోజు కూడా మరికొందరిని సీబీఐ అధికారులు ప్రశ్నించనున్నారు. మొత్తం మీద వివేకా హత్య కేసులో సీబీఐ విచారణ వేగవంతమయింది.

Tags:    

Similar News