వైఎస్ వర్థంతికి విజయమ్మ వేరుగా?

వైఎస్ రాజశేఖర్ రెడ్డి వర్ధంతి వచ్చే నెల 2వ తేదీన జరగనుంది. అయితే ఎప్పుడూ విజయమ్మ ఏపీలో కార్యక్రమాలను నిర్వహిస్తారు. కానీ ఈ ఏడాది మాత్రం వైఎస్ [more]

Update: 2021-08-29 04:50 GMT

వైఎస్ రాజశేఖర్ రెడ్డి వర్ధంతి వచ్చే నెల 2వ తేదీన జరగనుంది. అయితే ఎప్పుడూ విజయమ్మ ఏపీలో కార్యక్రమాలను నిర్వహిస్తారు. కానీ ఈ ఏడాది మాత్రం వైఎస్ రాజశేఖర్ రెడ్డి వర్థంతికి హైదరాబాద్ లో ప్రత్యేక కార్యక్రమాన్ని ఏర్పాటు చేశఆరు. పార్టీలకు అతీతంగా ఈ కార్యక్రమాన్ని విజయమ్మ నిర్వహిస్తున్నారు. ఈ కార్యక్రమానికి వైఎస్ రాజశేఖర్ రెడ్డికి సన్నిహితులు, ఆయన కేబినెట్ లో పనిచేసిన మంత్రులకు విజయమ్మ ఆహ్వానం పంపినట్లు తెలుస్తోంది. కేవీపీ, ఉండవల్లి, డి.శ్రీనివాస్, మాజీ స్పీకర్ సురేష్ రెడ్డి వంటి నేతలకు ఆహ్వనాలు వెళ్లినట్లు చెబుతున్నారు. తన కుమారుడు జగన్ తో విభేదించి వైఎస్ షర్మిల తెలంగాణ లో పార్టీ పెట్టిన తర్వాత ఈ పరిణామం చోటు చేసుకోవడం విశేషం. సీనియర్ నేతలందరీకి, పార్టీలకతీతంగా విజయమ్మ స్వయంగా ఫోన్ చేసి కార్యక్రమానికి రావాల్సిందిగా ఆహ్వానిస్తున్నట్లు చెబుతున్నారు.

Tags:    

Similar News