ఎవరితోనైనా పోరాటం చేస్తాం

వైఎస్సార్ తెలంగాణ పార్టీ తెలంగాణకు వ్యతిరేకం కాదని వైఎస్ షర్మిల అన్నారు. తెలంగాణకు చెందిన నీటిబొట్టును కూడా వదులుకోబోమని చెప్పారు. బోర్డుల సమావేశాలను కేసీఆర్ సీరియస్ గా [more]

Update: 2021-07-16 07:08 GMT

వైఎస్సార్ తెలంగాణ పార్టీ తెలంగాణకు వ్యతిరేకం కాదని వైఎస్ షర్మిల అన్నారు. తెలంగాణకు చెందిన నీటిబొట్టును కూడా వదులుకోబోమని చెప్పారు. బోర్డుల సమావేశాలను కేసీఆర్ సీరియస్ గా తీసుకోలేదని షర్మిల అభిప్రాయపడ్డారు. కేంద్ర ప్రభుత్వం పెద్దన్న పాత్ర పోషించాలని కోరుకుంటున్నట్లు షర్మిల తెలిపారు. సీఎం అంటే ఎవరు కేసీఆర్ కొడుకా? అని షర్మిల ప్రశ్నించారు. ఆరోగ్యశ్రీ, ఫీజు రీఎంబర్స్ మెంట్ లు తెలంగాణలో అమలు జరుగుతున్నాయా? అని వైఎస్ షర్మిల ప్రశ్నించారు. కేంద్రం విడుదల చేసిన గెజిట్ ను పూర్తిగా అధ్యయనం చేసిన తర్వాత స్పందిస్తానని, తెలంగాణ రాష్ట్ర ప్రయోజనాల కోసం ఎవరితోనైనా పోరాడతానని వైఎస్ షర్మిల తెలిపారు.

Tags:    

Similar News