త్యాగానికి టీటీడీ….!!!

ప్రత్యేక హోదా కోసం తన పదవికి రాజీనామా చేయడమే కాకుండా, పార్టీ కోసం టిక్కెట్ ను కూడా త్యాగం చేసిన వైవీ సుబ్బారెడ్డికి తిరుమల తిరుపతి దేవస్థానం [more]

Update: 2019-06-06 02:01 GMT

ప్రత్యేక హోదా కోసం తన పదవికి రాజీనామా చేయడమే కాకుండా, పార్టీ కోసం టిక్కెట్ ను కూడా త్యాగం చేసిన వైవీ సుబ్బారెడ్డికి తిరుమల తిరుపతి దేవస్థానం ఛైర్మన్ పదవి దాదాపుగా ఖరారయింది. ఈ మేరకు ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. త్వరలోనే దీనిపై ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసే అవకాశముంది. ఇటీవల జరిగిన ఎన్నికల్లో ఒంగోలు ఎంపీగా టీడీపీ నుంచి వచ్చిన మాగుంట సుబ్బరామిరెడ్డికి టిక్కెట్ ను జగన్ ఇచ్చారు. సిట్టింగ్ ఎంపీగా ఉన్న వైవీ సుబ్బారెడ్డికి నో చెప్పారు. ఆయనకు పశ్చిమ, తూర్పు గోదావరి జిల్లా బాధ్యతలను అప్పగించారు. ఈ ఎన్నికల్లో రెండు జిల్లాల్లోనూ వైసీపీ అత్యధిక స్థానాలను కైవసం చేసుకోవడంతో వైవీకి టీటీడీ ఛైర్మన్ పదవిని ఇవ్వాలని జగన్ నిర్ణయించినట్లు తెలిసింది. టీటీడీ బోర్డును రద్దు చేసిన అనంతరం వైవీని ఛైర్మన్ గా నియమిస్తూ ఉత్తర్వులు జారీ కానున్నాయి.

Tags:    

Similar News