జగన్ కు ఆసరా ఇస్తారా?

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి నేడు ఢిల్లీ పర్యటనలో ఉన్నారు. ఆయన ఈరోజు ఢిల్లీ వెళ్లి ప్రధాని నరేంద్ర మోదీని కలవనున్నారు. కేంద్ర హోంమంత్రి అమిత్ [more]

Update: 2019-08-06 02:23 GMT

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి నేడు ఢిల్లీ పర్యటనలో ఉన్నారు. ఆయన ఈరోజు ఢిల్లీ వెళ్లి ప్రధాని నరేంద్ర మోదీని కలవనున్నారు. కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో పాటు రాష్ట్రపతి, ఉప రాష్ట్రపతిని కూడా వైఎస్ జగన్ కలవనున్నారు. వైఎస్ జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా బాధ్యతలను స్వీకరించిన తర్వాత రెండోసారి అధికార పర్యటన చేస్తున్నారు. ఈ పర్యటనలో ఏపీకి రావాల్సిన నిధులు, విభజన హామీలతో పాటు పోలవరం ప్రాజెక్టు, పీపీఏల పై కూడా కేంద్రం పెద్దలతో చర్చించనున్నట్లు తెలిసింది. పోలవరం ప్రాజెక్టులో గత ప్రభుత్వం పాల్పడిన అవినీతిని కూడా కేంద్ర పెద్దల దృష్టికి తీసుకురానున్నారు. ఈరోజు, రేపు వైఎస్ జగన్ ఢిల్లీలోనే ఉంటారు.

Tags:    

Similar News