చంద్రబాబుకు వయసొచ్చింది కానీ?

టీడీపీ అధినేత చంద్రబాబు రౌడీయిజానికి దిగుతున్నారని ఏపీ ముఖ్యమంత్రి జగన్ అన్నారు. టీడీపీ సభ్యుడికి మాట్లాడే అవకాశమిచ్చినా పోడియం దగ్గర కూర్చోవడమేంటని జగన్ ప్రశ్నించారు. ఏ ప్రతిపక్ష [more]

Update: 2020-11-30 08:35 GMT

టీడీపీ అధినేత చంద్రబాబు రౌడీయిజానికి దిగుతున్నారని ఏపీ ముఖ్యమంత్రి జగన్ అన్నారు. టీడీపీ సభ్యుడికి మాట్లాడే అవకాశమిచ్చినా పోడియం దగ్గర కూర్చోవడమేంటని జగన్ ప్రశ్నించారు. ఏ ప్రతిపక్ష నాయకుడైనా చరిత్రలో పోడియం వద్ద కూర్చున్నారా? అని జగన్ ప్రశ్నించారు. చంద్రబాబు కావాలని రాద్ధాంతం చేస్తున్నారన్నారు. కేవలం ఐదు రోజులు మాత్రమే సభ ఉందని, ప్రజా సమస్యలపై చర్చ జరగాల్సిన సమయంలో, రైతులకు ఈ ప్రభుత్వంలో అధిక ప్రయోజనాలు దక్కుతున్నాయని భావించిన చంద్రబాబు సభను అడ్డుకుంటున్నారని జగన్ అన్నారు. వయసు వచ్చిన తర్వాత బుద్ది జ్ఞానం ఉండాలన్నారు. వైసీపీ ఎమ్మెల్యేను చంద్రబాబు అసభ్యకరంగా మాట్లాడారన్నారు. తమ పార్టీ ఎమ్మెల్యే హఫీజ్ ఖాన్ నుచంద్రబాబు ఏం పీకుతావు? అని ప్రశ్నించారని జగన్ అభ్యంతరం వ్యక్తం చేశారు.

Tags:    

Similar News