పంచె కట్టారు…తిరునామం పెట్టారు… పట్టువస్త్రాలను సమర్పించారు

ఏపీ ముఖ్యమంత్రి జగన్ తిరుమల శ్రీవారికి పట్టు వస్త్రాలు సమర్పించారు. సంప్రదాయమైన దుస్తులు ధరించి జగన్ ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ప్రత్యేకంగా జగన్ తిరునామం పెట్టుకున్నారు. పట్టుపంచె [more]

Update: 2020-09-23 13:07 GMT

ఏపీ ముఖ్యమంత్రి జగన్ తిరుమల శ్రీవారికి పట్టు వస్త్రాలు సమర్పించారు. సంప్రదాయమైన దుస్తులు ధరించి జగన్ ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ప్రత్యేకంగా జగన్ తిరునామం పెట్టుకున్నారు. పట్టుపంచె ధరించిన జగన్ కు ఆలయ అర్చకులు సాదర స్వాగతం పలికారు. బేడీ ఆంజనేయ స్వామి ఆలయంలో జగన్ ప్రత్యేక పూజలు చేవశారు. అనంతరం జగన్ పట్టువస్త్రాలను తలపై పెట్టుకుని తిరుమల శ్రీవారి చెంతకు వెళ్లారు. జగన్ వెంట టీటీడీ ఛైర్మన్ వైవీ సుబ్బారెడ్డి, ఆలయ ఈవో తదితరులు ఉన్నారు. పట్టువస్త్రాలతో మహాద్వారం నుంచి ఆలయ ప్రవేశం చేశారు. కాసేపట్లో గరుడ సేవలో పాల్గొననున్నారు.

Tags:    

Similar News