జగన్ ఫీడ్ బ్యాక్ నేడు?

ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఈనెల 30వ తేదీ వరకూ లబ్దిదారులు, నిపుణుల నుంచి సూచనలు తీసుకుంటున్నారు. ఏడాది పాలనపై వివిధ రంగాలపై ఆయన ఫీడ్ బ్యాక్ [more]

Update: 2020-05-27 02:57 GMT

ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఈనెల 30వ తేదీ వరకూ లబ్దిదారులు, నిపుణుల నుంచి సూచనలు తీసుకుంటున్నారు. ఏడాది పాలనపై వివిధ రంగాలపై ఆయన ఫీడ్ బ్యాక్ తీసుకుంటున్నారు. ఇప్పటికే సంక్షేమ పథకాలు, వ్యవసాయరంగంపై నిపుణుల సూచనలను తీసుకున్న జగన్ నేడు విద్యారంగంపై చర్చించనున్నారు. ఇంగ్లీష్ మీడియం, ప్రభుత్వ పాఠశాలల్లో నేడు-నాడు కార్యక్రమం వంటి విషయాలపై జగన్ నిపుణులతో చర్చించనున్నారు. ఇందులో తల్లిదండ్రులు కూడా పాల్గొంటారు.

Tags:    

Similar News