ముమ్మడి వరంలో జగన్

ముఖ్యమంత్రి వైఎస్ జగన్ తూర్పు గోదావరి జిల్లాలో పర్యటిస్తున్నారు. ఆయన ముమ్మడివరంలో వైఎస్సార్ వారధిని ప్రారంభించనున్నారు. ఈ వంతెన నిర్మాణంతో లంక గ్రామాల మధ్య రాకపోకలు సులువుగా [more]

Update: 2019-11-21 06:07 GMT

ముఖ్యమంత్రి వైఎస్ జగన్ తూర్పు గోదావరి జిల్లాలో పర్యటిస్తున్నారు. ఆయన ముమ్మడివరంలో వైఎస్సార్ వారధిని ప్రారంభించనున్నారు. ఈ వంతెన నిర్మాణంతో లంక గ్రామాల మధ్య రాకపోకలు సులువుగా మారతాయి. లేకుంటే పడవల్లో ప్రమాదకరమైన ప్రయాణం సాగించాల్సి వస్తుంది. ఈ వారధిని జగన్ ప్రారంభించారు. అలాగే వైఎస్సార్ మత్స్యకార భరోసా కార్యక్రమాన్ని కూడా జగన్ ప్రారంభించనున్నారు. వైఎస్సార్ మత్స్యకార భరోసా కార్యక్రమంతో దాదాపు లక్షా 30 వేల కుటుంబాలు లబ్దిపొందతనున్నాయి. చేపల వేట నిషేధ సమయంలో మత్స్యకారులకు 10 వేల రూపాయలు, డీజిల్ పై 9 రూపాయల సబ్సిడీ కింద ఇవ్వనున్నారు. ఈ పధకాన్ని జగన్ ముమ్మడివరంలో ప్రారంభించనున్నారు.

Tags:    

Similar News