పోలవరం ముంపు ప్రాంతాలపై జగన్?

పోలవరం ముంపు ప్రాంతాల నుంచి ప్రజలను తరలించాలని ముఖ్యమంత్రి జగన్ ఆదేశించారు. దేవీపట్నం మండలంలో కొన్ని గ్రామాలు పోలవరం ముంపునకు గురవుతుండటంతో వాటిని వెంటనే తరలించాలని జగన్ [more]

Update: 2020-04-30 07:15 GMT

పోలవరం ముంపు ప్రాంతాల నుంచి ప్రజలను తరలించాలని ముఖ్యమంత్రి జగన్ ఆదేశించారు. దేవీపట్నం మండలంలో కొన్ని గ్రామాలు పోలవరం ముంపునకు గురవుతుండటంతో వాటిని వెంటనే తరలించాలని జగన్ ఆదేశించారు. ఇందుకోసం 79 కోట్ల రూపాయల నిధులను విడుదల చేశారు. వారికి పూర్తి స్థాయిలో పునరావాసాన్ని కల్పించాలని జగన్ అధికారులను కోరారు. అలాగే ముంపు బాధితులకు అందించాల్సిన సాయాన్ని కూడా వెంటనే అందించేందుకు ఏర్పాట్లు చేయాలని కోరారు. పోలవరం ప్రాజెక్టు ను 2021కల్లా పూర్తి చేయాలని జగన్ ఆదేశించారు. గత ఏడాది కాఫర్ డ్యామ్ నిర్మాణం కారణంగా దేవీ పట్నం మండలంలో ఆరు గ్రామాలు మునిగిపోయాయి. వీటికోసం 79 కోట్ల నిధులను జగన్ కేటాయించారు.

Tags:    

Similar News