అంతా వాళ్లే…ఆదుకోండి అన్న జగన్

ప్రధాని మోడీ అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సమావేశంలో తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు జగన్, కేసీఆర్ లు పాల్గొన్నారు. కేసీఆర్ వెంట ఆరోగ్య [more]

Update: 2020-04-02 06:50 GMT

ప్రధాని మోడీ అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సమావేశంలో తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు జగన్, కేసీఆర్ లు పాల్గొన్నారు. కేసీఆర్ వెంట ఆరోగ్య శాఖ మంత్రి ఈటల రాజేంద్ర కూడా పాల్గొన్నారు. లాక్ డౌన్ ను కఠినంగా అమలు చేయడం, ఢిల్లీ మసీదు ప్రార్థనల్లో పాల్గొన్న వారిని గుర్తించడం, కరోనా నియంత్రణ వంటి అంశాలపై చర్చించారు. ఏపీలో కరోనా నివారణ చర్యలను గురించి జగన్ ప్రధాని మోదీకి వివరించారు. కరోనా పాజిటివ్ కేసుల్లో 111 మంది ఢిల్లీ నుంచి వచ్చిన వారేనని జగన్ ప్రధానికి వివరించారు. దీంతో పాటు ఏపీలో ఇంటింటి సర్వే విషయాన్ని కూడా ప్రధాని దృష్టికి తీసుకెళ్లారు. అవసరమైన వైద్య సామగ్రిని అందించాలని జగన్ ప్రధాని మోదీని కోరారు. కరోనాతో దెబ్బతిన్న ఏపీని ఆదుకోవాలని ఈ సందర్భంగా జగన్ మోదీని కోరారు.

Tags:    

Similar News