బ్రేకింగ్ : జగన్ అత్యవసర సమావేశం..ఢిల్లీకి వెళ్లి వచ్చిన వారిపై?

ఆంధ్రప్రదేశ్ లో ఢిల్లీ మత ప్రార్థనలకు వెళ్లి వచ్చిన వారి సంఖ్య ప్రభుత్వం లెక్క తేల్చింది. ఏపీ నుంచి 711 మంది ఢిల్లీకి వెళ్లి వచ్చినట్లు తేలింది. [more]

Update: 2020-03-31 06:11 GMT

ఆంధ్రప్రదేశ్ లో ఢిల్లీ మత ప్రార్థనలకు వెళ్లి వచ్చిన వారి సంఖ్య ప్రభుత్వం లెక్క తేల్చింది. ఏపీ నుంచి 711 మంది ఢిల్లీకి వెళ్లి వచ్చినట్లు తేలింది. కొత్తగా నమోదయిన 17 కేసుల్లో ఎక్కువమంది ఢిల్లీకి వెళ్లి వచ్చిన వారే కావడం గమనార్హం. ఏపీలో కేసులు పెరుగుతుండటంతో ముఖ్యమంత్రి జగన్ అత్యవసర సమావేశాన్ని ఏర్పాటు చేశారు. తాజాగా అనంతపురం లేపాక్షిలో రెండు పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. కొత్తగా అనంతపురంలో రెండు, ప్రకాశంలో ఎనిమిది, గుంటూరులో ఆరు, కృష్ణా, తూర్పు గోదావరి జిల్లాల్లో ఒక కేసు నమోదయింది. ఢిల్లీ వెళ్లి వచ్చిన వారి బంధువలను మొత్తం క్వారంటైన్ కు తరలించాలని జగన్ ఆదేశించారు.

Tags:    

Similar News