జగన్ ఉన్నతస్థాయి సమీక్ష… కరోనా కట్టడిపై?

కరోనా వైరస్ కట్టడిపై ఏపీ ముఖ్యమంత్రి జగన్ మరిన్ని చర్యలు తీసుకోనున్నారు. జగన్ కొద్దిసేపటి క్రితం ఉన్నతస్థాయి సమీక్షను నిర్వహించారు. ఈ సమీక్షలో ఇంటింటి సర్వే పై [more]

Update: 2020-03-25 06:47 GMT

కరోనా వైరస్ కట్టడిపై ఏపీ ముఖ్యమంత్రి జగన్ మరిన్ని చర్యలు తీసుకోనున్నారు. జగన్ కొద్దిసేపటి క్రితం ఉన్నతస్థాయి సమీక్షను నిర్వహించారు. ఈ సమీక్షలో ఇంటింటి సర్వే పై జగన్ అధికారులను అడిగి తెలుసుకున్నారు. రెండు రోజుల పాటు ఏపీలో ఇంటింటి సర్వే నిర్వహించాలని జగన్ ఆదేశించిన సంగతి తెలిసిందే. సర్వేలో కుటుంబ సభ్యుల ఆరోగ్య వివరాలతో పూర్తి స్థాయి నివేదిక అందిన తర్వాత మరిన్ని చర్యలుత ీసుకోవాలని జగన్ భావిస్తున్నారు. ఈ సర్వేతో విదేశాల నుంచి వచ్చిన వారి సంఖ్యకూడా స్పష్టంగా తెలుస్తుందంటున్నారు. ఈ సమీక్షలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీలం సాహ్నితో పాటు ఉన్నతాధికారులు పాల్గొన్నారు.

Tags:    

Similar News