మే నెలాఖరుకల్లా విశాఖకు?

సచివాలయాన్ని మే నెలాఖరుకు విశాఖకు తరలించాలని జగన్ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు ఉద్యోగ సంఘాలకు సమాచార మిచ్చింది. జూన్ నెల నుంచి మళ్లీ పాఠశాలలు, [more]

Update: 2020-03-18 14:36 GMT

సచివాలయాన్ని మే నెలాఖరుకు విశాఖకు తరలించాలని జగన్ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు ఉద్యోగ సంఘాలకు సమాచార మిచ్చింది. జూన్ నెల నుంచి మళ్లీ పాఠశాలలు, కళాశాలలు ప్రారంభం కానుండటంతో మే చివరి నాటికి విశాఖకు సచివాలయాన్న తరలించేలా ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తోంది. ఉద్యోగ సంఘాలు కూడా మే నెలలోనే విశాఖకు తరలిపోవాలని భావిస్తున్నాయి. ఈ మేరకు అన్ని ప్రధాన శాఖలకు ఆదేశాలు వెళ్లినట్లు తెలుస్తోంది. విశాఖ పరిపాలనా రాజధానిగా ప్రకటించిన తర్వాత అక్కడ కార్యాలయాలను కూడా సిద్ధం చేశారు.

Tags:    

Similar News