స్వయంగా జగన్

ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ స్వయంగా శాసనమండలి రద్దు తీర్మానాన్ని శాసనసభలో ప్రవేశపెట్టారు. శాసనమండలి ని రద్దు చేస్తూ తీసుకున్న నిర్ణయాన్ని జగన్ అసెంబ్లీలో ప్రవేశపెట్టారు. అంతకు [more]

Update: 2020-01-27 06:37 GMT

ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ స్వయంగా శాసనమండలి రద్దు తీర్మానాన్ని శాసనసభలో ప్రవేశపెట్టారు. శాసనమండలి ని రద్దు చేస్తూ తీసుకున్న నిర్ణయాన్ని జగన్ అసెంబ్లీలో ప్రవేశపెట్టారు. అంతకు ముందు సమావేశమయిన బిజినెస్ అడ్వయిజరీ కమిటీ సమావేశంలో ఈ ఒక్క రోజు మాత్రమే సభను నిర్వహించాలని నిర్ణయించింది. బీఏసీ నిర్వహించకుండా శాసనసభలో శాసనమంలి రద్దు తీర్మానంపై ఎలా చర్చిస్తారని టీడీపీ స్పీకర్ కు లేఖ రాసిన సంగతి తెలిసిందే. ఈనేపథ్యంలో అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం కాగానే బీఏసీ సమావేశాన్ని ఏర్పాటు చేస్తున్నట్లు స్పీకర్ ప్రకటించారు. బీఏసీ సమావేశం పూర్తయిన తర్వాత శాసనసభ సమావేశాలు ప్రారంభమయ్యాయి. జగన్ శాసనమండలి రద్దు తీర్మానాన్ని ప్రవేశపెట్టగానే సభ్యులు బల్లలు చరిచి తమ ఆమోదాన్ని తెలియజేశారు.

Tags:    

Similar News