సీబీఐ కోర్టులో జగన్?

ముఖ్యమంత్రి హోదాలో మొదటిసారి సీబీఐ కోర్టుకు వైఎస్ జగన్ హాజరు కాబోతున్నారు. ఈరోజు ఉదయం పది గంటల సమయంలో వైఎస్ జగన్ కోర్టుకు హాజరు అవుతున్నట్టుగా ఇప్పటికే [more]

Update: 2020-01-10 01:31 GMT

ముఖ్యమంత్రి హోదాలో మొదటిసారి సీబీఐ కోర్టుకు వైఎస్ జగన్ హాజరు కాబోతున్నారు. ఈరోజు ఉదయం పది గంటల సమయంలో వైఎస్ జగన్ కోర్టుకు హాజరు అవుతున్నట్టుగా ఇప్పటికే సమాచారం ఇచ్చారు. ఇందుకు సంబంధించి పోలీసులు భద్రతా ఏర్పాటు చేశారు. విజయవాడలోని తాడేపల్లి నుంచి గన్నవరం ఎయిర్ పోర్టుకు చేరుకుంటారు. అక్కడ నుంచి ప్రత్యేక విమానంలో బేగంపేట ఎయిర్ పోర్ట్ కు జగన్ చేరుకుంటారు. బేగంపేట ఎయిర్ పోర్టు నుంచి రోడ్డు మార్గం ద్వారా నాంపల్లిలోని సీబీఐ కోర్టుకు జగన్ వస్తారు. దీనికి సంబంధించిన రూట్ మాప్ ను ఇప్పటికే ఏపీ పోలీసులు, తెలంగాణ పోలీసులకు అందజేశారు. అయితే తెలంగాణ, ఆంధ్ర పోలీనులు కట్టుదిట్టమైన భద్రత ఏర్పాట్లు చేశారు. ముఖ్యమంత్రి హోదాలో వైఎస్ జగన్ వస్తున్న నేపథ్యంలో భారీ బందోబస్తు ఏర్పాటు చేస్తున్నట్టుగా తెలంగాణ పోలీసులు తెలిపారు. క్విడ్ ప్రోకో కేసులో వైఎస్ జగన్ తప్పనిసరిగా కోర్టుకు హాజరు కావాలని ఇప్పటికే సీబీఐ కోర్టు న్యాయమూర్తి ఆదేశాలు జారీ చేశారు.

Tags:    

Similar News