కర్ఫ్యూపై కట్టుదిట్టంగా అమలు చేయాల్సిందే

రాష్ట్రంలో కర్ఫ్యూ అమలవుతున్న తీరుపై ప్రతి జిల్లానుంచి ప్రతి రోజూ నివేదిక ఇవ్వాలని డీజీపీకి సీఎం జగన్ ఆదేశించారు. నిర్దేశించిన సమయంలో కర్ఫ్యూ అమలు చేయాలని సీఎం [more]

Update: 2021-05-11 01:31 GMT

రాష్ట్రంలో కర్ఫ్యూ అమలవుతున్న తీరుపై ప్రతి జిల్లానుంచి ప్రతి రోజూ నివేదిక ఇవ్వాలని డీజీపీకి సీఎం జగన్ ఆదేశించారు. నిర్దేశించిన సమయంలో కర్ఫ్యూ అమలు చేయాలని సీఎం జగన్ ఆదేశించారు. జిల్లాల్లో ప్రతి బుధవారం కోవిడ్‌రివ్యూ కమిటీలు సమావేశం కావాలని జగన్ కోరారు. క్షేత్రస్థాయిలో ఉన్న సమస్యలను ప్రజా ప్రతినిధులు అధికారులకు వివరించే అవకాశం కలుగుతున్నందన్న జగన్ ఈ సమావేశంలో అందుతున్న ఫీడ్‌బ్యాక్‌ను పరిశీలించి సమస్యలను ఎక్కడికక్కడ పరిష్కరించాలని ఆదేశించారు. కాగా, రాష్ట్రంలో కోవిడ్‌ ఆస్పత్రులు, బెడ్ల వివరాలను అధికారులు సమీక్షా సమావేశంలో వివరించారు.

Tags:    

Similar News