జగన్ తిరుపతి పర్యటన రద్దు.. కారణమిదే?

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ పర్యటన రద్దయింది. కరోనా కేసుల తీవ్రత దృష్ట్యా తన పర్యటనను రద్దు చేసుకుంటున్నట్లు జగన్ ప్రకటించారు. ఈ మేరకు తిరుపతి ఓటర్లకు [more]

Update: 2021-04-11 01:26 GMT

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ పర్యటన రద్దయింది. కరోనా కేసుల తీవ్రత దృష్ట్యా తన పర్యటనను రద్దు చేసుకుంటున్నట్లు జగన్ ప్రకటించారు. ఈ మేరకు తిరుపతి ఓటర్లకు జగన్ బహిరంగ లేఖ రాశారు. 24 గంటల్లో మరణించిన 11 మందిలో నలుగురు చిత్తూరు, నెల్లూరు జిల్లా వాసులేనని జగన్ పేర్కొన్నారు. తాను తిరుపతి సభకు హాజరైతే అధిక సంఖ్యలో జనం హాజరవుతారని, కరోనా కేసులు మరింత పెరిగే అవకాశమున్నందున తాను తిరుపతి బహిరంగ సభను రద్దు చేసుకుంటున్నట్లు జగన్ ప్రకటించారు. తనకు సోదరుడి లాంటి వాడయిన గురుమూర్తిని గెలిపించాలని జగన్ ప్రజలకు తన లేఖలో కోరారు.

Tags:    

Similar News