తేజస్వి కుటుంబానికి జగన్ ఆర్థిక సాయం

ఒంగోలులో ఆత్మహత్యకు పాల్పడిన తేజస్వి కుటుంబానికి ఏపీ ముఖ్యమంత్రి జగన్ పదిలక్షల ఆర్థికసాయాన్ని ప్రకటించారు. ఫీజు కట్టలేమని మనస్తాపానికి గురై ఇంజినీరింగ్ విద్యార్థిని తేజస్వి ఆత్మహత్యకు పాల్పడిన [more]

Update: 2021-02-09 02:00 GMT

ఒంగోలులో ఆత్మహత్యకు పాల్పడిన తేజస్వి కుటుంబానికి ఏపీ ముఖ్యమంత్రి జగన్ పదిలక్షల ఆర్థికసాయాన్ని ప్రకటించారు. ఫీజు కట్టలేమని మనస్తాపానికి గురై ఇంజినీరింగ్ విద్యార్థిని తేజస్వి ఆత్మహత్యకు పాల్పడిన సంగతి తెలిసిందే. దీనిపై స్పందించిన ముఖ్యమంత్రి జగన్ పది లక్షల ఆర్థిక సాయాన్ని తేజస్వి కుటుంబానికి ప్రకటించారు. ఈ మేరకు ప్రకాశం జిల్లా కలెక్టర్ భాస్కర్ పది లక్షల ఆర్థిక సాయాన్ని తేజస్వి కుటుంబానికి అందజేశారు. వారి కుటుంబంలో ఒకరికి ఉద్యోగాన్ని కల్పిస్తామని హామీ ఇచ్చారు.

Tags:    

Similar News