సుప్రీీంకోర్టుకు జగన్ సర్కార్…?

ఆంధ్రప్రదేశ్ లో స్థానిక సంస్థల ఎన్నికల షెడ్యూల్ విడుదల కావడంతో జగన్ ప్రభుత్వం సుప్రీంకోర్టుకు వెళ్లాలని నిర్ణయించింది. ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ ఎన్నికల షెడ్యూల్ [more]

Update: 2021-01-09 02:04 GMT

ఆంధ్రప్రదేశ్ లో స్థానిక సంస్థల ఎన్నికల షెడ్యూల్ విడుదల కావడంతో జగన్ ప్రభుత్వం సుప్రీంకోర్టుకు వెళ్లాలని నిర్ణయించింది. ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ ఎన్నికల షెడ్యూల్ ను విడుదల చేసిన సంగతి తెలిసిందే. నేటి నుంచి ఎన్నికల నియమావళి కూడా అమలులోకి రానుంది. 23వ తేదీన తొలి దశ నోటిఫికేషన్ విడుదల కానున్న నేపథ్యంలో జగన్ ప్రభుత్వం సుప్రీం కోర్టుకు వెళ్లాలని నిర్ణయించింది. కోవిడ్ వ్యాక్సిన్ పంపిణీ కార్యక్రమం ఉన్నందున స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణ సాధ్యం కాదని ప్రభుత్వం సుప్రీంకోర్టును ఆశ్రయించనుంది.

Tags:    

Similar News