చంద్రగిరి చెల్లిని చూసి చలించిన జగన్

తిరుమల నుంచి రేణిగుంట విమానాశ్రయానికి చేరుకున్న జగన్ ఇద్దరు అక్కాచెల్లెళ్ల వేదన విని చలించిపోయారు. ఇద్దరు అక్కాచెల్లెళ్లు తమ సోదరుడు స్కూలు భవనంపై నుంచి పడి కోమాలోకి [more]

Update: 2019-10-01 09:01 GMT

తిరుమల నుంచి రేణిగుంట విమానాశ్రయానికి చేరుకున్న జగన్ ఇద్దరు అక్కాచెల్లెళ్ల వేదన విని చలించిపోయారు. ఇద్దరు అక్కాచెల్లెళ్లు తమ సోదరుడు స్కూలు భవనంపై నుంచి పడి కోమాలోకి వెళ్లిపోయారని, చికిత్స చేయించుకునేందుకు కూడా డబ్బుల్లేవని చంద్రగిరికిచెందిన వీరు వాపోయారు. గతకొన్నాళ్లుగా ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ తిరిగినా ఫలితం లేదని వారు కన్నీటి పర్యంతమయ్యారు. చంద్రగిరి నియోజకవర్గానికి చెందిన ఈకుటుంబానికి వెంటనే జగన్ పది లక్షలరూపాయలు వైద్య సాయం కోసం, కుటుంబ పోషణకు ఐదు లక్షలు ఇస్తున్నట్లు ప్రకటించారు. తమకు అండగా నిలిచిన జగన్ కు వారు కృతజ్ఞతలు తెలిపారు.

Tags:    

Similar News