ఇచ్చిన మాట నిలబెట్టుకున్న జగన్

వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి ఎమ్మెల్యే కోటాలో దక్కనున్న ఒక్క ఎమ్మెల్సీ పదవికి జగన్ అభ్యర్థిని ప్రకటించారు. ఇచ్చిన మాటకు కట్టుబడి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ బీసీ సెల్ [more]

Update: 2019-02-18 08:28 GMT

వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి ఎమ్మెల్యే కోటాలో దక్కనున్న ఒక్క ఎమ్మెల్సీ పదవికి జగన్ అభ్యర్థిని ప్రకటించారు. ఇచ్చిన మాటకు కట్టుబడి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ బీసీ సెల్ అధ్యక్షుడు జంగా కృష్ణమూర్తికి ఎమ్మెల్సీ పదవి ఇవ్వనున్నట్లు ఆ పార్టీ అధినేత వై.ఎస్. జగన్మోహన్ రెడ్డి ప్రకటించారు. ఈ మేరకు ఆయన నిన్న ఏలూరులో జరిగిన బీసీ సింహగర్జన సభలో ఈ మేరకు ప్రకటన చేశారు. గురజాల నియోజకవర్గంలో కాసు మహేష్ రెడ్డి పార్టీలో చేరిన సమయంలో అప్పటివరకు ఆ నియోజకవర్గానికి సమన్వయకర్తగా ఉన్న జంగా కృష్ణమూర్తికి అన్యాయం చేయనని, చట్ట సభల్లో స్థానం కల్పిస్తానని ఆయన హామీ ఇచ్చారు. ఈ మేరకు ఇప్పుడు వైసీపీకి దక్కనున్న ఎమ్మెల్సీ స్థానాన్ని జంగా కృష్ణమూర్తికి ఇస్తామని ప్రకటించారు.

Tags:    

Similar News