జ‌గ‌న్ గృహ‌ప్ర‌వేశం వాయిదా

వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వై.ఎస్. జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి గృహ‌ప్రవేశం వాయిదా ప‌డింది. ఆంధ్ర‌ప్ర‌దేశ్ రాజధాని అమ‌రావ‌తిలోని తాడేప‌ల్లిలో జ‌గ‌న్ నూత‌న ఇల్లు, వైఎస్సార్సీపీ కార్యాల‌యం నిర్మాణం [more]

Update: 2019-02-12 14:07 GMT

వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వై.ఎస్. జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి గృహ‌ప్రవేశం వాయిదా ప‌డింది. ఆంధ్ర‌ప్ర‌దేశ్ రాజధాని అమ‌రావ‌తిలోని తాడేప‌ల్లిలో జ‌గ‌న్ నూత‌న ఇల్లు, వైఎస్సార్సీపీ కార్యాల‌యం నిర్మాణం పూర్త‌య్యింది. ఈ నెల 14వ తేదీన ఆయ‌న నూత‌న ఇంటిలోకి గృహ‌ప్ర‌వేశం చేయాల్సి ఉంది. ఇందుకు సంబంధించి ఏర్పాట్లు కూడా పూర్త‌య్యాయి. పార్టీ నేత‌లు అంద‌రూ హాజ‌రుకావాల్సిందిగా ఆహ్వానాలు కూడా పంపించారు. అయితే, ఇప్పుడు ఈ కార్య‌క్ర‌మం తాత్కాలికంగా వాయిదా ప‌డింది. జ‌గ‌న్ సోద‌రి వైఎస్ ష‌ర్మిల‌, బావ అనీల్ అనారోగ్యంతో ఉండ‌టంతో గృహ‌ప్ర‌వేశ కార్య‌క్ర‌మాన్ని వాయిదా వేశారు. త్వ‌ర‌లోనే కొత్త గృహ‌ప్ర‌వేశ తేదీని ప్ర‌క‌టించ‌నున్నారు.

Tags:    

Similar News