జగన్ ప్రచారం అక్కడి నుంచే….!!!

అభ్యర్థుల జాబితాపై తుది కసరత్తు చేస్తున్న వై.ఎస్ జగన్ 16న ఉదయం 10.20 గంటలకు ఇడుపులపాయలో విడుదల చేయనున్నారు. ఇవాళ మొదటి విడత విడుదల చేయాల్సి ఉన్నా [more]

Update: 2019-03-13 07:24 GMT

అభ్యర్థుల జాబితాపై తుది కసరత్తు చేస్తున్న వై.ఎస్ జగన్ 16న ఉదయం 10.20 గంటలకు ఇడుపులపాయలో విడుదల చేయనున్నారు. ఇవాళ మొదటి విడత విడుదల చేయాల్సి ఉన్నా పార్టీలో చేరికల వల్ల 16కి వాయిదా వేసినట్లు పార్టీ ప్రధాన కార్యదర్శి తలశిల రఘురాం పేర్కొన్నారు. ఎల్లుండి సాయంత్రం వెంకటాద్రి ఎక్స్ ప్రెస్ లో జగన్ కడప చేరుకోనున్నారు. 16న వైఎస్సార్ కు నివాళులర్పించిన తర్వాత ఒకేసారి అన్ని స్థానాలకూ అభ్యర్థులను ప్రకటించనున్నారు. అనంతరం ఆయన గుంటూరు జిల్లా గురజాల చేరకొని అక్కడి నుంచే ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించనున్నారు.

Tags:    

Similar News