భీమవరంలో జగన్ వరం…!!!

కేంద్రంలో ఏ పార్టీకీ అధికారం చేపట్టేందుకు కావాల్సిన సీట్లు వచ్చే పరిస్థితి లేదని, 25 ఎంపీ సీట్లనూ వైసీపీ గెలుచుకుంటే ప్రత్యేక హోదా ఇచ్చే వారికే మద్దతు [more]

Update: 2019-04-01 13:06 GMT

కేంద్రంలో ఏ పార్టీకీ అధికారం చేపట్టేందుకు కావాల్సిన సీట్లు వచ్చే పరిస్థితి లేదని, 25 ఎంపీ సీట్లనూ వైసీపీ గెలుచుకుంటే ప్రత్యేక హోదా ఇచ్చే వారికే మద్దతు ఇస్తామనని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వై.ఎస్. జగన్మోహన్ రెడ్డి పేర్కొన్నారు. ప్రధాని ఎవరైనా ప్రత్యేక హోదా ఇచ్చి తీరాల్సిందేనన్నారు. సోమవరం భీమవరంలో జరిగిన ఎన్నికల ప్రచార సభలో జగన్ మాట్లాడుతూ… ప్రత్యేక హోదా వస్తే ఉద్యోగ విప్లవం వస్తుందన్నారు. పరిశ్రమలు, పెట్టుబడులు పెద్ద ఎత్తున వస్తాయని, ప్రతీ జిల్లా అభివృద్ధి చెందుతుందన్నారు. తాము అధికారంలోకి వచ్చాక కులాలు, మతాలు, ప్రాంతాలు, పార్టీలు చూడకుండా అర్హులైన అందరికీ పథకాలు అందిస్తామన్నారు. భీమవరంలో ‘లోకల్ హీరో’ గ్రంధి శ్రీనివాస్ ను గెలిపించాలని కోరారు. భీమవరంలో జగన్ సభకు పెద్దయెత్తున ప్రజలు హాజరయ్యారు. భీమవరం నియోజకవర్గంలో జనసేన అధినేత పవన్ కల్యాణ్ పోటీ చేస్తుండటంతో ప్రాధాన్యత పెరిగింది.

Tags:    

Similar News