బాబువన్నీ తప్పుడు లెక్కలే

పవర్ పర్చేజ్ అగ్రిమెంట్ల విషయంలో చంద్రబాబునాయుడు తప్పుడు లెక్కలు చూపుతున్నారని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అన్నారు. అనవసరంగా అధికారులపై చంద్రబాబునాయుడు అక్కసును వెళ్లగక్కతున్నారన్నారు. అవసరం లేకున్నా [more]

Update: 2019-07-19 08:32 GMT

పవర్ పర్చేజ్ అగ్రిమెంట్ల విషయంలో చంద్రబాబునాయుడు తప్పుడు లెక్కలు చూపుతున్నారని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అన్నారు. అనవసరంగా అధికారులపై చంద్రబాబునాయుడు అక్కసును వెళ్లగక్కతున్నారన్నారు. అవసరం లేకున్నా విద్యుత్తును కొనుగోలు చేశారని వైఎస్ జగన్ ఆరోపించారు. నాలుగేళ్లలో 5,4797 కోట్ల రూపాయలు గత ప్రభుత్వం ఎక్కువ చెల్లించిందన్నారు. పీపీఏలపై నిపుణుల కమిటీని వేశామని, ఆ నివేదిక ఇంకా అందాల్సి ఉందన్నారు జగన్. ధర్మల్ పవర్ తక్కువగా ఉన్నా కావాలని విండ్ పవర్ ను చంద్రబాబునాయుడు కొనుగోలు చేశారన్నారు. కుక్కతోక వంకర అన్నట్లు ప్రతిపక్షం ఉందని జగన్ ఎద్దేవా చేశారు. 5 శాతానికి కొనుగోలు చేయమంటే 5.59 శాతానికి విద్యుత్తును ఎందుకు కొనుగోలు చేయాల్సి వచ్చిందని జగన్ ప్రశ్నించారు.

Tags:    

Similar News