జగన్ దంపతులకు కేసీఆర్ ఆత్మీయ స్వాగతం

ఆంధ్రప్రదేశ్ కాబోయే ముఖ్యమంత్రి వై.ఎస్. జగన్మోహన్ రెడ్డి తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ను కలిశారు. శనివారం రాజ్ భవన్ లో గవర్నర్ నరసింహన్ ను కలిసిన జగన్ [more]

Update: 2019-05-25 13:15 GMT

ఆంధ్రప్రదేశ్ కాబోయే ముఖ్యమంత్రి వై.ఎస్. జగన్మోహన్ రెడ్డి తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ను కలిశారు. శనివారం రాజ్ భవన్ లో గవర్నర్ నరసింహన్ ను కలిసిన జగన్ అక్కడి నుంచి ప్రగతి భవన్ వెళ్లారు. సతీమణి భారతి, నేతలు విజయసాయిరెడ్డి, మిథున్ రెడ్డితో కలిసి జగన్ ప్రగతి భవన్ వెళ్లారు. కేసీఆర్ స్వయంగా జగన్ దంపతులకు లోపలికి ఆహ్వానించారు. తర్వాత టీఆర్ఎస్ మంత్రులు, నేతలను జగన్ కు కేసీఆర్ పరిచయం చేశారు. భారతిని సైతం కేసీఆర్ వారి కుటుంబసభ్యులకు పరిచయం చేశారు. ఎన్నికల్లో అఖండ విజయం సాధించిన జగన్ కు కేసీఆర్ స్వీట్ తినిపించి శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం ఆయనను సన్మానించారు. ఈ నెల 30న జరిగిన తన ప్రమాణస్వీకారానికి రావాల్సిందిగా కేసీఆర్ ను జగన్ ఆహ్వానించారు.

Tags:    

Similar News